విశాఖలో నకిలీ ఎస్‌ఐల ఘరానా మోసం | Fake SIs cheated the unemployed in Visakha | Sakshi
Sakshi News home page

విశాఖలో నకిలీ ఎస్‌ఐల ఘరానా మోసం

Mar 8 2024 4:34 AM | Updated on Mar 9 2024 7:32 PM

Fake SIs cheated the unemployed in Visakha - Sakshi

పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులకు వల 

దాదాపు రూ.3 కోట్లు దండుకున్నట్లు సమాచారం 

నిందితులను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న టాస్‌్కఫోర్స్‌ 

ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): పోలీసు ఎస్సైల వేషమేసి, పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఘరానా మోసగాడైన హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు అంచనా.

బాధితుల కథనం ప్రకారం.. మోసాలతోనే బతికే హనుమంతు రమేష్‌ (47) అడవివరంలోని ఆర్‌ఆర్‌ టవర్స్‌లో ఉంటున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా ఇటీవల మరో ప్రియరాలితో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు.

వీరికి పలువురు మధ్యవర్తులు సహకరించారు. హనుమంతు, ప్రియురాలు, మిగతా వారు పోలీసు ఎస్సైల గెటప్‌లో రావడంతో వారంతా నమ్మేశారు. దాదాపు 30 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దండుకొని మాయమయ్యారు. 



హైదరాబాద్‌లో అదుపులోకి.. 
బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసు కమిషనర్‌ సూచనలతో టాస్‌్కఫోర్స్‌ బృందాలు హైదరాబాద్‌ వెళ్లి హనుమంతు రమేష్ ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నాయి.

వీరిద్దరినీ గురువారం సాయంత్రం టాస్‌్కఫోర్స్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీసు కమిషనర్‌ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.  

Advertisement
 
Advertisement
Advertisement