Kampara Ramesh News: Kakinada Corporator Ramesh Murdered | కాకినాడలో కార్పొరేటర్‌ దారుణ హత్య - Sakshi
Sakshi News home page

కాకినాడలో కార్పొరేటర్‌ దారుణ హత్య

Feb 12 2021 9:19 AM | Updated on Feb 12 2021 12:35 PM

Corporator Assassination In East Godavari - Sakshi

కాకినాడ కార్పొరేటర్ కంపర రమేష్‌ను కారుతో ఢీ కొట్టి హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): జిల్లాలో దారుణం జరిగింది. కాకినాడ కార్పొరేటర్ కంపర రమేష్‌‌ దారుణ హత్యకు గురయ్యారు. కాకినాడ వాకపూడి గానుగచెట్టు సెంటర్ వద్ద గల కార్ వాష్ షెడ్ ఎదురుగా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను చేసినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హత్యకు ముందు రమేష్ ఇదే కార్ వాష్ షెడ్ లో మిత్రులతో కలసి మద్యం సేవించారు. అనంతరం ఇళ్లకు కార్లపై వెళ్లే సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. నలుగురుపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి రమేష్ మృతదేహాన్ని తరలించారు.

చదవండి:
 నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్‌’ నిగ్గుతేల్చండి


టీడీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మద్యం


 

Advertisement
 
Advertisement
Advertisement