– 8లో
పలమనేరులోని కౌండిన్య నదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి జేబులు నింపుకుంటున్నారు.
ఇది మా జీవనాధారం
చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 56 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఆ కాయలు తోలికొచ్చి ఈ మార్కెట్ యార్డులో అమ్ముకుంటున్నాం. ఈ స్థలంలో ఆ మురుగునీటి కేంద్రాన్ని తెచ్చి పెట్టి మా జీవనాధరంపై దెబ్బకొట్టకండి. రైతులు ఇప్పుడే కుప్ప కూలిపోయారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలి.
– జయపాల్, మామిడి రైతు
రైతుల స్థలంలో వద్దు
ఇది మామిడి కాయల మార్కెట్ స్థలం. మాకు మామిడి కాయ లు అమ్ముకునేందుకు ఈ స్థలం బాగుంది. 40 ఏళ్లుగా ఈ స్థలంలోనే కాయలు అమ్ముకుంటున్నాం. ఇలాంటి స్థలంలో ఎందుకు మురుగునీటి శుద్ధి కేంద్రం...? దయచేసి ఇక్కడ పెట్టవద్దు. కట్టమంచి–దొడ్డిపల్లి మార్గంలో నీవానది ఒడ్డున ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ పెట్టొచ్చు. ఇంకా మురకంబట్టు ప్రాంతంలో ప్రభుత్వ భూములు దండిగా ఉన్నాయి. అక్కడ కూడా పెట్టొచ్చు. రైతులు పొట్ట నింపుకునే ప్రాంతంలో మాత్రం వద్దు.
– విజయనాయుడు, మామిడి రైతు


