గంగాధర నెల్లూరు: వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరిందని, దాన్ని తొలగించి కొత్తదాన్ని నిర్మించాలని మండలంలోని నందనూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ ట్యాంకు నుంచి నందనూరు, దళితవాడలోని దాదాపు 200 కుటుంబాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీన్ని అనేక ఏళ్ల క్రితం నిర్మించారు. తర్వాత మరమ్మతులు చేపట్టలేదు. దీంతో శిథిలావస్థకు చేరింది. స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పైకప్పు పెచ్చులు ఊడడంతో ఇనుప కమ్మీలు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి ట్యాంకును కూలదోసి నూతన ట్యాంకు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


