
వెరిటాస్ సైనిక్ స్కూల్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
● దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే వెరిటాస్ లక్ష్యం ● వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బీ.శేషారెడ్డి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్య తో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి కేద్రం ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అను మతి పొందడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బీ.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించడంతోపాటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక, మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యనందిస్తున్నట్టు తెలిపారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటి అన్ని సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించిన సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్ మీడియట్తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వెరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బీ.శ్రీకర్రెడ్డి, బీ.సందీప్రెడ్డి పాల్గొన్నారు.