వేదాంత దూకుడు: గుజరాత్‌లో సెమీకండక్టర్‌ ప్లాంటు | Vedanta To Open usd 20 Billion Semiconductor Factory Gujarat: Report | Sakshi
Sakshi News home page

Vedanta దూకుడు: గుజరాత్‌లో సెమీకండక్టర్‌ ప్లాంటు

Sep 13 2022 8:53 AM | Updated on Sep 13 2022 8:54 AM

Vedanta To Open usd 20 Billion Semiconductor Factory Gujarat: Report - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్‌ ప్లాంటును గుజరాత్‌లో ఏర్పాటు చేయాలని పారిశ్రామిక దిగ్గజం వేదాంత నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో తలపెడుతున్న ఈ ప్రాజెక్టులో డిస్‌ప్లే, సెమీకండక్టర్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  అయితే దీనిపై వేదాంత ప్రతినిధులు కానీ,  ఫాక్స్‌కాన్ వెంటనే స్పందించ లేదు.

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కలిసి 20 బిలియన్‌ డాలర్ల జాయింట్‌ వెంచర్‌గా వేదాంత తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు కోసం తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక కూడా పోటీపడ్డాయి. కానీ ఇటీవల ముగిసిన తుది చర్చల్లో మహారాష్ట్రను పక్కకు నెట్టి గుజరాత్‌ ఆ ప్రాజెక్టును దక్కించుకుంది.   కాగా భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2020లో  15 బిలియన్‌ డాలర్లనుంచి  2026 నాటికి  63 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement