Union Budget 2023: బడ్జెట్ చరిత్రలో ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా!

Union Budget 2023: Top Interesting Facts In Budget History You Need To Know - Sakshi

జనవరి చివరి వారం వచ్చేసింది. దీంతో దేశవ్యాప్తంగా బడ్జెట్‌ పేరు మారుమోగుతోంది. ఇందులో కేంద్రం అందించే కేటాయింపులు, పలు రంగాలను ప్రభావితం చేసే నిర్ణయాలు, పన్ను తగ్గింపు లేదా పెంపు చర్యలపై, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యలుపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందో అని సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్‌ సంస్ధలు ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ఫిబ్రవరి 1న వార్షికబడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో బడ్జెట్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేద్దాం!

10: మొరార్జీ దేశాయ్ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ల సంఖ్య, ఇప్పటి వరకు తిరుగులేని రికార్డు. దేశాయ్ జవహర్‌లాల్ నెహ్రూ (1958-1963), ఇందిరా గాంధీ (1967-1969) హయాంలో భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1996-1998, 2004-2008, 2012-2014 మధ్య తొమ్మిది బడ్జెట్‌లతో పి.చిదంబరం రెండవ స్థానంలో ఉండగా, ఎనిమిది బడ్జెట్‌లను సమర్పించిన ప్రణబ్ ముఖర్జీ (1982-1984,  2008-2012) జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు.

మూడు: సాధారణ ఆర్థిక మంత్రి లేకపోవడంతో ప్రధానులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముగ్గురూ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారు. టిటి కృష్ణమాచారి రాజీనామా తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ 1958 బడ్జెట్‌ను సమర్పించారు. బ్యాంక్ జాతీయీకరణకు వ్యతిరేకంగా తన ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత ఇందిరా గాంధీ 1970 బడ్జెట్‌ను సమర్పించారు. రాజీవ్ గాంధీ 1987లో VP సింగ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసిన తర్వాత బడ్జెట్‌ను సమర్పించారు, ఆ పోర్ట్‌ఫోలియోను తాత్కాలికంగా తన వద్ద ఉంచుకున్నారు.

800: 1977లో హెచ్‌ఎం పటేల్ బడ్జెట్ ప్రసంగంలోని పదాల సంఖ్య. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఆర్థిక మంత్రి చేసిన అతి చిన్న ప్రసంగం అంటే ఇదే.

18,700: డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 బడ్జెట్‌లోని పదాల సంఖ్య - అత్యధిక పదాలు కలిగిన బడ్జెట్‌ ఇది. ఇప్పటికీ ఆ రికార్డ్‌ అలానే ఉంది. దేశంలో ఆర్థిక సరళీకరణకు నాంది పలికినందున 1991 బడ్జెట్ చరిత్రలో అత్యధికంగా కోట్ చేయడంతో పాటు విశ్లేషించబడిన బడ్జెట్‌ ఇది.

162: 2020 బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు సీతారామన్ మాట్లాడిన మొత్తం నిమిషాల సంఖ్య. ఈ బడ్జెట్‌ ప్రసంగం ద్వారా గతంలో తను నమోదు చేసిన రికార్డ్‌ను ఆమె అధిగమించింది.  2019లో 137 నిమిషాల మాట్లాడి సుదీర్ఘంగా  ప్రసంగించి రికార్డ్‌ నమోదు చేసింది. సీతారామన్ కంటే ముందు, 135 పాటు మాట్లాడిన జస్వంత్ సింగ్ (నిడివి పరంగా) అత్యధిక ప్రసంగం చేసిన రికార్డును కలిగి ఉన్నారు.

1999: కేంద్ర బడ్జెట్ సమయం సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 11 గంటలకు మార్చిన సంవత్సరం. 

2017: రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్‌తో విలీనమైన సంవత్సరం. ఫిబ్రవరి మొదటి రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం కల్పించేందుకు ఈ తేదీ మార్పు ఉపయోగపడుతోంది.

3,94,49,09,00,00,000: భారత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాలని ప్రతిపాదించిన మొత్తం. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది ₹ 39.44 లక్షల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనా కంటే 4.6 శాతం పెరిగింది.

13.3: 2022 బడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం 13.3 శాతం. రక్షణ పెన్షన్‌ల కోసం ₹ 1.19 లక్షల కోట్లతో సహా ₹ 5.25 లక్షల కోట్ల బడ్జెట్‌ను మంత్రిత్వ శాఖకు కేటాయించారు.

10,40,00,00,00,000: మొత్తం విద్యా బడ్జెట్ 2022-23లో మొదటిసారిగా ₹ 1-లక్ష కోట్లు దాటింది. గత ఏడాది విద్యకు కేటాయింపులు ₹ 1.04 లక్షల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనాల కంటే 18.5 శాతం ఎక్కువ.

చదవండి: బడ్జెట్‌: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top