
గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఎట్టకేలకు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు (మే 31) పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66700 (22 క్యారెట్స్), రూ.72760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి.
ఈ రోజు చెన్నైలో కూడా బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 67300 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73420 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరలే ఈ రోజూ ఉన్నట్లు సమిష్టమవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు ఎటువంటి మార్పు చెందలేదు. నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66850, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72910గా ఉంది.
వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి మాత్రం రూ. 1000 తగ్గింది. కాబట్టి కేజీ వెండి ధర రూ. 95500 వద్ద ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా వెండి ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. కానీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).