మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు | Stock Market: Sensex down 213 pts and Nifty at 24853 | Sakshi
Sakshi News home page

మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు

Jun 18 2025 1:23 AM | Updated on Jun 18 2025 1:23 AM

Stock Market: Sensex down 213 pts and Nifty at 24853

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం 

సెన్సెక్స్‌ నష్టం 213 పాయింట్లు  

ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు మెటల్, ఫార్మా, ఆయిల్‌అండ్‌గ్యాస్‌ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 213 పాయింట్లు నష్టపోయి 81,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు పతనమై 24,853 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్‌ 369 పాయింట్లు కోల్పోయి 81,427 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 24,814 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.

ఆసియాలో కొరియా, జపాన్‌ నికాయ్‌ ఇండెక్సులు లాభాల్లో.., చైనా, హాంగ్‌కాంగ్‌ ఇండెక్సులు నష్టాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.  

డాలర్‌ మారకంలో రూపాయి 30 పైసలు బలహీనపడి 86.34 వద్ద స్థిరపడింది. ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్ధం, క్రూడాయిల్‌ ధరలు పుంజుకోవడం, డాలర్‌ బలోపేతం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 85.96 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ఇంట్రాడేలో 85.96 – 86.28 శ్రేణిలో ట్రేడైంది.

ఓస్వాల్‌ పంప్స్‌ ఐపీఓకు 34 రెట్ల స్పందన  
ఓస్వాల్‌ పంప్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు 34.42 రెట్ల అధిక స్పందన లభించింది. క్యూఐబీ కోటా 88.08 రెట్లు, రిటైల్‌ కోటా 3.60 రెట్లు, నాన్‌ ఇన్‌స్టి ట్యూషనల్‌ కోటా 36.7 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement