
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 356 పాయింట్లు లాభపడి 22,952 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1126 పాయింట్లు పుంజుకుని 75,347 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, మారుతీసుజుకీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ విప్రో సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. సన్ఫార్మా, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ కంపెనీ షేర్లు నష్టపోయాయి.
మార్కెట్లు గురువారం జీవితకాల గరిష్టాలను చేరాయి. మార్కెట్లో కొంతకాలంగా దాదాపు 2లక్షలమేరకు షార్ట్ కాంట్రాక్టులు బిల్డ్ చేశారు. కొద్దిరోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. దాంతో షార్ట్కవరింగ్ ర్యాలీలో భాగంగా ఇవ్వాళ నిఫ్టీ 22950 మార్కును చేరినట్లు నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)