శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 261.79 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 77,763.91 వద్ద, నిఫ్టీ 95.15 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,270.85 వద్ద నిలిచాయి.
డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏషియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్, సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్, సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


