శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.05 పాయింట్లు లేదా 1.44 శాతం నష్టంతో 74,775.74 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్లు లేదా 1.50 శాతం నష్టంతో 23,547.75 వద్ద నిలిచాయి.
సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జయకే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, లింకన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్, నాట్కో ఫార్మా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


