మనీ మార్కెట్లకు సెలవులో మార్పు: రిజర్వ్‌ బ్యాంక్‌ | RBI Declares September 8 as Money Market Holiday Following Maharashtras Eid e Milad Shift | Sakshi
Sakshi News home page

మనీ మార్కెట్లకు సెలవులో మార్పు: రిజర్వ్‌ బ్యాంక్‌

Sep 5 2025 5:36 PM | Updated on Sep 5 2025 5:50 PM

RBI Declares September 8 as Money Market Holiday Following Maharashtras Eid e Milad Shift

ముంబై: మనీ మార్కెట్లకు ఈ నెల 8న సెలవు వర్తించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతక్రితం ప్రకటించిన సెలవు తేదీ 5ను తాజాగా 8కు మార్చడంతో ప్రభుత్వ సెక్యూరిటీ(జీసెక్‌)లు, విదేశీ మారకం, రుపీ ఇంటరెస్ట్‌ రేటు డెరివేటివ్స్‌లో లావాదేవీలు, సెటిల్‌మెంట్స్‌ ఉండబోవని స్పష్టం చేసింది. వెరసి ఈ నెల 5న జీసెక్‌లు, విదేశీ మారకం, మనీ మార్కెట్, రుపీ ఇంటరెస్ట్‌ రేటు డెరివేటివ్స్‌ మార్కె ట్లు యథావిధిగా పనిచేస్తాయని తెలియజేసింది.  

ఇంకొంత వివరంగా చెప్పాలంటే ఈ సెలవు మార్పు వెనుక ఉన్న కారణం మహారాష్ట్ర ప్రభుత్వం  తీసుకున్న తాత్కాలిక నిర్ణయం. ముంబై నగరంలో సెప్టెంబర్‌ 6న జరగనున్న అనంత చతుర్దశి  సందర్భంగా గణేశ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. అదే సమయంలో ఈద్-ఎ-మిలాద్ కూడా జరగనుండటంతో, రెండు పెద్ద ఉత్సవాలు ఒకే రోజు జరగడం వల్ల లాజిస్టికల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో, మత సామరస్యత, సౌకర్యవంతమైన నిర్వహణ కోసం ఈద్-ఎ-మిలాద్ సెలవును సెప్టెంబర్‌ 8కి మార్చినట్లు ప్రభుత్వం తెలిపింది.   ఈ మార్పు ప్రభావం  ముంబై నగరం, పరిసర జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం సెప్టెంబర్‌ 5న సెలవు యథావిధిగా అమలులో ఉంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement