రూల్స్‌ మార్చరూ.. ట్రాయ్‌కు జియో విన్నపం | Jio seeks Trai review of net neutrality norms | Sakshi
Sakshi News home page

రూల్స్‌ మార్చరూ.. ట్రాయ్‌కు జియో విన్నపం

Nov 14 2025 4:49 PM | Updated on Nov 14 2025 5:07 PM

Jio seeks Trai review of net neutrality norms

5జీ సాంకేతికత రాకతో అంతర్జాతీయంగా మార్కెట్లలో మార్పులు, టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా నెట్‌ న్యూట్రాలిటీ నిబంధనలను సడలించాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని రిలయన్స్‌ జియో కోరింది. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణతో, గేమింగ్‌ కోసం తక్కువ లేటెన్సీ ఉండే విధంగా, అప్‌లోడ్స్‌ కోసం వేగం ఎక్కువగా ఉండేలా వివిధ అవసరాలకు తగ్గ వేగంతో ఇంటర్నెట్‌ లభ్యత ఉండేలా ప్రోడక్టులను రూపొందించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని వివరించింది.

బ్రిటన్‌ నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్‌ కూడా ప్రత్యేక సర్వీసులు, ప్రీమియం నాణ్యత గల ఇంటర్నెట్‌ సర్వీసులను అందించేందుకు అనుమతిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీయంగా కఠినతరమైన నిబంధనలను సడలించాలని కోరింది. జియో, ఎయిర్‌టెల్‌లాంటి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఏ ఒక్క యాప్, వెబ్‌సైట్‌ లేదా సర్వీసులపై పక్షపాతం చూపకుండా అన్నింటినీ ఒకే దృష్టితో చూస్తూ, ఒకే రకమైన వేగంతో అందించాలని నెట్‌ న్యూట్రాలిటీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.

అంతేకాక, నెట్‌ న్యూట్రాలిటీపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో 5జీ, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, ఐఓటీ వంటి ఆధునిక సాంకేతికతల వల్ల ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ మరింత క్లిష్టమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న డేటా వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలంటే నెట్‌వర్క్‌లలో ‘క్వాలిటీ ఆఫ్ సర్వీస్‌’ (QoS) ఆధారంగా ప్రాధాన్యత కేటాయించే అవకాశాలు పరిశీలించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో, వినియోగదారుల ప్రాథమిక హక్కులు, ఏ యాప్‌కైనా సమాన యాక్సెస్‌ లభించాలనే సూత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement