బంగారం, వెండిపై ఆసక్తి: ఇదిగో కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ | Axis Gold and Silver Passive FOF Fund | Sakshi
Sakshi News home page

బంగారం, వెండిపై ఆసక్తి: ఇదిగో కొత్త మ్యూచువల్‌ ఫండ్‌

Dec 15 2025 8:32 PM | Updated on Dec 15 2025 8:32 PM

Axis Gold and Silver Passive FOF Fund

బంగారం, వెండిపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా.. యాక్సిస్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ ప్యాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను తీసుకొచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ న్యూ ఆఫర్‌. ఈ నెల 10న మొదలు కాగా, 22వ తేదీన ముగియనుంది.

ఈ ఒక్క పథకం ద్వారా ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరల ర్యాలీలో భాగం కావొచ్చని సంస్థ ప్రకటించింది. ఈ పథకం గోల్డ్‌ ఈటీఎఫ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లల్లో 50:50 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ‘‘చారిత్రకంగా చూస్తే బంగారం, వెండి ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు చక్కని హెడ్జింగ్‌ సాధనంగా పనిచేశాయి. అదే సమయంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ప్రయోజనాలను సైతం పోర్ట్‌ఫోలియోకి అందిస్తాయి’’అని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో బి.గోపకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement