సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సీహెచ్పీ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తుండగా, దీన్ని మరింత పెంచేలా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ ట్రాఫిక్) అబ్దుల్ రెహమాన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐఆర్టీఎస్ ఈడీ బి.వెంకన్న, ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్తో కలిసి సీహెచ్పీలోని సైలోబంకర్, రైల్వే లోడింగ్ పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించి సామర్థ్యం పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు డి.నరేంద్రవర్మ, ఎన్వీఆర్.ప్రహ్లాద్, కె.సోమశేఖరరావు, బొల్లం శ్రీనివాస్, సాయినాధ, ఎ.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


