● ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్
విద్యాచందన
ఇల్లెందు: ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. సోమవారం ఇల్లెందులోని సీఈఆర్ క్లబ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సుల తరలింపు నిబంధనల ప్రకారం జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్, ఎంపీడీఓ ధన్సింగ్ పాల్గొన్నారు.


