సాంస్కృతిక వేడుకలు షురూ..
భద్రాచలంటౌన్: ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ ఈఓ దామోదరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముక్కోటి వేడుకల సందర్భంగా నిత్యం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కనువిందు చేస్తామని తెలిపారు. కొత్తగూడేనికి చెందిన అమృతవర్షిణి మ్యూజిక్ అకాడమీ సభ్యులు భక్తి రంజని కార్యక్రమం నిర్వహించగా.. చిన్నారులు ఆదిత్య, ఉదయశ్రీ, అధ్యయనశ్రీ ఆలపించిన భక్తి గీతాలు ఆలపించారు.
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం మిథిలా స్టేడియంలో సురభి కళాకారులు ప్రదర్శించిన లవకుశ నాటకం కనువిందు చేసింది.


