ఏకశిలానగరి శ్రీ కోదండ రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా సీతారాముల వివాహ మహోత్సవాలు అన్ని ఆలయాల్లోనూ నవమి నాడే అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. భద్రాచలం రామక్షేత్రంలో, తిరుపతి కోదండ రామాలయంలోనూ దాదాపు అన్ని చోట్ల చైత్ర శుద్ధపాడ్యమి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. నవమి నాటి కల్యాణంతో ముగుస్తాయి. ఇలా అనేక చోట్ల పగలు రామయ్య పెళ్లి జరిగితే ఒక్క ఒంటిమిట్టలోనే రాత్రి వేళ నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. ఆలయ దివ్య దర్శనం ప్రజలకు అందుబాటు లోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది.


