దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యామలం చేసేందుకు జగనన్న సీమ లిఫ్ట్ పథకం తీసుకొచ్చారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టు దిక్కు. దీని ఆధారంగా చేపట్టిన సీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయించి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. మన రైతాంగానికి దక్కాల్సిన నీటి వాటా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 800 అడుగుల నుంచే నీటిని తోడుకుని సీమ ప్రాజెక్టులకు అందించేలా చేపట్టిన లిఫ్టు పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలి.
–దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మదనపల్లె


