టీ20 విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan Wishes to Indian Cricket Team | Sakshi
Sakshi News home page

టీ20 విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు

Jun 30 2024 7:07 AM | Updated on Jun 30 2024 10:11 AM

YS Jagan Wishes to Indian Cricket Team

భారత క్రికెట్‌ జట్టుకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అభినందనలు

సాక్షి, అమరావతి: టీ20 వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కృషి, పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకుందని ప్రశంసించారు. టోర్నీ ఆద్యంతం సమష్టి కృషితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు. 

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరట­నిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలుగువాడు కావడం గర్వ­కారణమన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో అతడు చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించాడని కొనియాడారు. రానున్న రోజుల్లో టీమ్‌ ఇండియా మరిన్ని చాంపియన్‌షిప్‌లు సాధించాలని ఆకాంక్షించారు.  

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement