రాష్ట్రంలో టెక్‌ మహీంద్రా స్టార్‌ హోటల్స్‌ | Tech Mahindra Star Hotels in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో టెక్‌ మహీంద్రా స్టార్‌ హోటల్స్‌

Oct 13 2023 5:03 AM | Updated on Oct 13 2023 7:04 PM

Tech Mahindra Star Hotels in the state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో ఫైవ్‌ స్టార్, సెవెన్‌ స్టార్‌ హోటల్స్‌ నిర్మించేందు­కు మహీంద్రా హాలిడేస్‌ చైర్మన్, టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీసీ గుర్నాని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన గురు­­వారం సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యా­రు. స్టార్‌ హోటల్స్‌ ఏర్పాటు గురించి సీఎం జగన్‌కు ఆయన వివరించారు.

ఒక్కో హోటల్‌ నిర్మా­ణానికి రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్‌ వివరించారు. విశాఖ సహా 3 పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటల్స్‌ నిర్మాణం చేపట్టనున్నా­మని.. వచ్చే 2 నెలల్లో శంకుస్థాపన చేపడతామని మహీంద్రా ప్రతినిధులు వెల్లడించారు. మహీ­ంద్రా గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్రా సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్రా విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement