తిరుపతి: వందే భారత్‌ రైలుపై రాళ్లదాడి.. | Stones Pelted On Vande Bharat Express Train In Gudur | Sakshi
Sakshi News home page

తిరుపతి: వందే భారత్‌ రైలుపై రాళ్లదాడి.. ఆర్‌పీఎఫ్‌ అదుపులో ఇద్దరు

Apr 28 2023 7:13 AM | Updated on Apr 28 2023 9:24 AM

Stones Pelted On Vande Bharat Express Train In Gudur - Sakshi

గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో గురువారం దుండగులు వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడిచేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్‌పీఎఫ్‌ సీఐ సందీప్‌ తెలిపారు. 

గురువారం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న రైలు మధ్యాహ్నం గూడూరు దాటిన తరువాత కొండగుంట స్టేషన్‌ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో కొందరు రాళ్లతో దాడిచేసినట్లు చెప్పారు. ఈ దాడిలో రైలు అద్దాలు పగిలాయని, లోపలి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆర్‌పీఎఫ్‌ సీఐ చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement