తిరుపతి: వందే భారత్‌ రైలుపై రాళ్లదాడి.. ఆర్‌పీఎఫ్‌ అదుపులో ఇద్దరు

Stones Pelted On Vande Bharat Express Train In Gudur - Sakshi

గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో గురువారం దుండగులు వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడిచేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్‌పీఎఫ్‌ సీఐ సందీప్‌ తెలిపారు. 

గురువారం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న రైలు మధ్యాహ్నం గూడూరు దాటిన తరువాత కొండగుంట స్టేషన్‌ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో కొందరు రాళ్లతో దాడిచేసినట్లు చెప్పారు. ఈ దాడిలో రైలు అద్దాలు పగిలాయని, లోపలి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆర్‌పీఎఫ్‌ సీఐ చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top