మరో 10,542 టెన్త్‌ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌ | Reverification of SSC Answer Sheets: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మరో 10,542 టెన్త్‌ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌

May 28 2024 4:21 AM | Updated on May 28 2024 4:21 AM

Reverification of SSC Answer Sheets: Andhra Pradesh

సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సంబంధించి మరో 10,542 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ పూర్తి చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు. మొత్తం 55,996 మంది రీ వెరిఫికేషన్‌/ రీ కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

మార్కుల పరిశీ­లన ప్రక్రియ పూర్తిచేసిన 43,714 మంది జవాబు పత్రాలను ఈ నెల 23న ఆయా స్కూళ్లకు ఆన్‌లైన్‌లో పంపించారు. మరో 10,542 మంది జవాబు పత్రాలను సోమ­వారం ఆయా స్కూళ్లకు పంపించగా, మిగిలిన 1,710 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్‌ చేసి త్వరలోనే పంపిస్తామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement