సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి | New Born Baby Died in Anantapur: Hospital Negligence | Sakshi
Sakshi News home page

సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి

Oct 5 2025 5:08 AM | Updated on Oct 5 2025 5:08 AM

New Born Baby Died in Anantapur: Hospital Negligence

శిశువును ఖననం చేస్తున్న దృశ్యం

అనంతపురం శిశుగృహలో విషాదం

అనంతపురం సెంట్రల్‌: అనంతపురంలోని మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో దయ­నీయ పరిస్థితి చోటు చేసుకుంది. సక్రమంగా పాలు పట్టకపోవడంతో తీవ్ర అనారోగ్యంపాలైన ఓ నవ­జాత శిశువు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శిశుగృహ, ఐసీడీఎస్‌ సిబ్బంది శిశువును ఖననం చేయడం పలు అను­మానా­లకు తావిస్తోంది. ఐసీడీఎస్‌ అధికారుల కథ­నం మేరకు.. 20 రోజుల క్రితం కళ్యాణదుర్గానికి చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చి, ధర్మవరం వెళ్లే రోడ్డులోని ముళ్లపొదల్లో వదిలేసింది.

స్థాని­కులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వ­డంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు అప్పగించారు. 2 రోజుల పాటు పాలు సక్రమంగా అందించకపో­వ­డంతో దసరా రోజు అనారోగ్యం పాలైనట్లు సమా­చా­రం. గురువా­రం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో శిశువును చూసుకునే ఆయా స్థానిక ప్రభు­త్వాసు­పత్రికి తీసు­కెళ్లింది. అప్పటికే పసిబిడ్డ మృతి చెందిన­ట్లు వైద్యు­లు ధ్రువీకరించారు. ఈ ఘటన గురించి ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులకు, చైల్‌ 
వెల్ఫేర్‌ కమిటీ సభ్యులకు తెలియజేయకుండానే కాంట్రాక్టు సిబ్బందే ఖననం చేసేశారు.

చిన్నారి అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, అదే రోజు ఖననం చేశా­రని అనంతపురం ఐసీడీఎస్‌ ప్రా­జె­క్టు డైరెక్టర్‌ నాగమణి తెలిపారు. ఈ విషయం అధి­కారులకు తెలి­యడంతో.. నీ వల్లే అంటూ ఇద్దరు మహి­ళా సిబ్బంది ఒకర్నొ­కరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.

నిర్లక్ష్యంతోనే పసివాడి ఆకలిచావు
కాగా, శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అనాథలు, పోషణ భారంగా మారిన వారి చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఐసీ­డీఎస్‌ ఆధ్వర్యంలో శిశుగృహను నిర్వహిస్తోంది. ఇక్కడ గ్రూపు తగాదాల కారణంగా కొంత­కాలంగా సిబ్బంది సక్రమంగా పనిచే­యడం లేదు. శుక్ర­వారం ఇద్దరు ఆయాలు పనిచేయగా.. రాత్రి రావా­ల్సిన ఇద్దరు ఆయాల్లో ఒకరు సెలవు పెట్టారు.  దీంతో పాల కోసం చాలాసేపు ఏడ్చిన శిశువు చివరకు అర్ధరాత్రి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న ఆయా ఆ చిన్నారిని తీసు­కొని ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఆమె ఆస్పత్రికి వెళ్లేలోగానే దారిమధ్యలోనే ఈ చిన్నారి ప్రాణాలు వదిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement