శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ఆదివారం నుంచి 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. సాయంత్రం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పిస్తారు.
ప్రతిరోజు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు. 15న మహా శివరాత్రి రోజున ప్రబోత్సవం, నందివాహన సేవ, రాత్రి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం చేస్తారు. 16న స్వామి అమ్మవార్లకు రథోత్సవం, తెప్పోత్సవం, 17న పూర్ణాహుతి, ధ్వజావరోహణం, 18న అశ్వ వాహనసేవ, శయనోత్సవం, ఏకాంత సేవను నిర్వహిస్తారు.


