ఓటరు జాబితాలపై ఆదేశాలు ఇచ్చాం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మార్చి 9వ తేది నాటికి ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడతాం. రెవెన్యూ అధికారుల నుంచి అసెంబ్లీ ఓటరు జాబితాలను తీసుకొని వార్డుల వారీగా విభజించి ఓటరు జాబితాలను రూపొందించాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త పంచాయతీలకు సంబంధించి 21 మండలాల నుంచి తమకు అందిన 38 ప్రతిపాదనలను సీపీఆర్కు పంపించాం. కొత్త పంచాయతీల ఏర్పాటు సీపీఆర్ పరిధిలో ఉంటుంది. – జీ భాస్కర్,
కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి


