9 నుంచి 11 వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు
కర్నూలు(సెంట్రల్): అటవీ, ఎండోమెంట్ శాఖల్లోని ఫారెస్టు బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ మెయిన్స్, తండేల్(ఫారెస్టు), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడు–2(ఎండోమెంట్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ పరీక్షలను ఫిబ్రవరి 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల సమన్వయాధికారి/డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో ఏపీపీఎస్సీ పరీక్షల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీక్షల నిర్వహణకు జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 9,958 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్తోపాటు ఒక ఫొటో ఐడెంటిటీ కార్డుతో వస్తేనే లోపలికి అనుమతిస్తామన్నారు.


