సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌ ఏపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌రావు 

Lakshman Rao is AP President of Satyasai Seva Organization - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్‌.లక్ష్మణ్‌రావును ఎంపిక చేశారు. చాలా కాలంగా ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తోన్న అనుభవం ఉండటంతో ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆదివారం తెలిపింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జి.చలంను సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌ నేషనల్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా నియమించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top