శ్రీవారిని ద‌ర్శించుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు

Kovvur MLA  And Other Celebrities Visited TTD - Sakshi

సాక్షి, తిరుప‌తి : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో  కోవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలంగాణ దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎస్ గోపాల్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఇచ్చిన హామీల‌న్నీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అమలు చేస్తున్నార‌ని, దేవుని ఆశీర్వాదాలు ఆయ‌న‌పై ఎప్ప‌టికీ ఉండాల‌ని కోరుకుంటున్నా అని కోవ్వురు ఎమ్మెల్యే  ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. 


 


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'జర్నీ'ఫేమ్ అన‌న్య‌
‘జ‌ర్నీ’ సినిమా ఫేమ్ అన‌న్య  మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు  స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. (చదవండి: లోక కళ్యాణార్థం టీటీడీలో అఖండ పారాయణం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top