రాష్ట్రంలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు | Heavy rains in the state for four to five days | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు

Jun 11 2025 1:56 AM | Updated on Jun 11 2025 8:37 AM

Heavy rains in the state for four to five days

ఈరోజూ, రేపు అధికంగా వానలు 

రాయలసీమపై అధిక ప్రబావం  

సాక్షి, అమరావతి: వచ్చే నాలుగైదు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న­ట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకు, ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్య ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురు­స్తా­యని పేర్కొంది. రాయలసీమపై దీని ప్రభా­వం అధికంగా ఉంటుందని తెలిపింది. అనంత­పురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న­ట్లు తెలిపింది. 

కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా 11, 12 తేదీ­ల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు కొన్ని­చోట్ల ఉక్కపోతతోపాటు ఎండ ప్రభావం ఉంటుం­దని తెలిపింది. 

మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 4.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.2, విశాఖ జిల్లా ఆనందపురంలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా వేమవరంలో 40 డిగ్రీలు, కొనకనమిట్లలో 39.9, తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9, వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement