ఒంగోలు: చెరువుకొమ్ముపాలెం లో గల్లంతైన చిన్నారుల ఘటన విషాదంగా ముగిసింది. నీటికుంటలో గల్లంతైన నలుగురు చిన్నారులు మృతిచెందారు. పిల్లల మృతదేహాలను సహాయక సిబ్బంది వెలిక్కితీశారు. మృతిచెందిన వారి వివరాలు 1) కరేటి అభిరామ్ (14) , కరేటి సుశాంత్ (12), పొదిలి చెన్ను (11) ఇల్లా దినేష్ (10) సంవత్సరాలుగా తెలుస్తోంది. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు దిక్కులు పెక్కటిల్లేలా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
కాగా కొద్దిసేపటి క్రితం ప్రమాదవశాత్తు నీటికుంటలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడి చేరుకున్నారు. హుటాహుటీన గజఈతగాళ్లను రప్పించి గాలింపులు చేపట్టగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.


