నీటికుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి | Four children missing after falling into a puddle | Sakshi
Sakshi News home page

నీటికుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి

Jun 4 2026 3:38 PM | Updated on Jun 4 2026 4:56 PM

Four children missing after falling into a puddle

ఒంగోలు: చెరువుకొమ్ముపాలెం లో గల్లంతైన చిన్నారుల ఘటన విషాదంగా ముగిసింది. నీటికుంటలో గల్లంతైన నలుగురు చిన్నారులు మృతిచెందారు. పిల్లల మృతదేహాలను సహాయక సిబ్బంది వెలిక్కితీశారు. మృతిచెందిన వారి వివరాలు 1) కరేటి అభిరామ్ (14) , కరేటి సుశాంత్ (12), పొదిలి చెన్ను (11) ఇల్లా దినేష్ (10) సంవత్సరాలుగా తెలుస్తోంది. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు దిక్కులు పెక్కటిల్లేలా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

కాగా కొద్దిసేపటి క్రితం ప్రమాదవశాత్తు నీటికుంటలో  నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడి చేరుకున్నారు. హుటాహుటీన గజఈతగాళ్లను రప్పించి గాలింపులు చేపట్టగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement