ఏపీలో 9,125 మంది డిశ్చార్జ్‌ | Corona Tests Exceeding Above 55 Lakhs In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 9,125 మంది డిశ్చార్జ్‌

Sep 27 2020 3:32 AM | Updated on Sep 27 2020 3:32 AM

Corona Tests Exceeding Above 55 Lakhs In AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం క్రమేణా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 89.31 శాతం రికవరీ రేటుగా ఉంది. గడిచిన 24 గంటల్లో 75,990 మందికి పరీక్షలు నిర్వహించగా. 7,293 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 55,23,786 మందికి పరీక్షలు నిర్వహించగా 6,68,751 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన 24 గంటల్లో 9,125 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,97,294కి చేరింది. తాజాగా 57 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 5,663కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది. ఏపీలో మిలియన్‌ జనాభాకు 1,03,442 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాక్టివ్‌ కేసులు 65,794 ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement