ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పోలవరం పర్యటన రద్దు

CM YS Jagan Mohan Reddy Polavaram visit canceled - Sakshi

ఏలూరు (మెట్రో): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన పశ్చిమగోదావరి జిల్లా పర్యటన రద్దయిందని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు ముఖ్యమంత్రి రావాల్సి ఉందని, అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సీఎం పర్యటన రద్దయిందని ఆయన వెల్లడించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top