తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్‌ పర్యటన | Cm Jagan Tirupati And Bapatla Districts Tour On December 8 | Sakshi
Sakshi News home page

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్‌ పర్యటన

Dec 7 2023 8:23 PM | Updated on Dec 7 2023 8:32 PM

Cm Jagan Tirupati And Bapatla Districts Tour On December 8 - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు.

సాక్షి, తాడేపల్లి:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు.

అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్న సీఎం జగన్.. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో  దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సీఎం సమావేశం కానున్నారు.
ఇదీ చదవండి: అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement