సాక్షి,కృష్ణ: విజయవాడలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై కూటమి ప్రభుత్వం స్పందించింది. కంటితుడుపు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. సాయికృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా సాయి కృష్ణ మిస్సింగ్పై ప్రభుత్వం స్పందించలేదు.తాజాగా, సాయికృష్ణ కేసుపై చంద్రబాబు, పవన్ సమీక్ష నిర్వహించారు.


