ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్‌ సీరియస్‌ | AP Government Serious On Andhra Jyothi Story Misleading Judiciary | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్‌ సీరియస్‌

Aug 15 2020 2:37 PM | Updated on Aug 15 2020 7:06 PM

AP Government Serious On Andhra Jyothi Story Misleading Judiciary - Sakshi

ఆంధ్రజ్యోతి తప్పుడు కథనంపై చట్ట ప్రకారం, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

సాక్షి, అమరావతి: ‘న్యాయమూర్తులపై నిఘా’ అంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5 వార్తా సంస్థల్లో వచ్చిన కథనాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఆ రెండు మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలుకు సన్నద్ధమైంది. పరువునష్టం దావా సహా, చట్టపరమైన చర్యలపై ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సారించింది. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా, పక్కా వ్యూహంతోనే ఈ కథనం అల్లారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహంతోనే న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కథనంపై న్యాయ వ్యవస్థతో నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను వివరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
(ఇది బీసీలపై దాడే...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement