ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్‌ సీరియస్‌

AP Government Serious On Andhra Jyothi Story Misleading Judiciary - Sakshi

సాక్షి, అమరావతి: ‘న్యాయమూర్తులపై నిఘా’ అంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5 వార్తా సంస్థల్లో వచ్చిన కథనాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఆ రెండు మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలుకు సన్నద్ధమైంది. పరువునష్టం దావా సహా, చట్టపరమైన చర్యలపై ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సారించింది. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా, పక్కా వ్యూహంతోనే ఈ కథనం అల్లారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహంతోనే న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కథనంపై న్యాయ వ్యవస్థతో నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను వివరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
(ఇది బీసీలపై దాడే...)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top