ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు!

AP Government Released The Bulletin On Coronavirus - Sakshi

అమరావతి: ఏపీలో కరోనా కల్లో‍లం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 35,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,582  కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన  22 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 2,343 మంది క్షేమంగా కొలుకున్నారు.  ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా..  9 లక్షల 7వేల 598 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం 44,686 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,56,77,992 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. 

చదవండి: కనీసం 15 రోజులు లాక్‌డౌన్!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top