Andhra Pradesh Records New 19,981 COVID-19 Cases - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు

May 22 2021 6:09 PM | Updated on May 22 2021 6:59 PM

Andhra Pradesh New Coronavirus Positive Cases - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 90,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,59,165 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 118 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,022కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 18,336 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 13 లక్షల 41వేల 355 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,10,683  యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,85,25,758 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి: 50 పడకలు దాటితే.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ ప్లాంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement