ఏపీలో కోటి దాటిన కరోనా పరీక్షలు | 690 New Coronavirus Positive Cases Recorded In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కోటి దాటిన కరోనా పరీక్షలు

Nov 29 2020 5:31 PM | Updated on Nov 29 2020 7:55 PM

690 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కోటి 17వేల 126 పరీక్షలు నిర్వహించింది. గత 24 గంటల్లో 54,710 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 690 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,67,683కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 3,787 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,52,298 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ( భారత్‌లో కొత్తగా 41,810 కరోనా కేసులు )

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,397. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 7 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,988కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement