కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నాయి. ఫీజు నియంత్ర చట్టాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు. ట్యూషన్, బస్, పుస్తకాలు, యూనిఫామ్, స్నాక్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక బ్రాంచ్కు అనుమతి తీసుకుని నాలుగైదు బ్రాంచులు నడుపుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. ఒకటో తరగతికి రూ.లక్ష ఫీజు వసూలు చేస్తున్నారు.
– కుళ్లాయిస్వామి, జిల్లా ప్రధానకార్యదర్శి, ఏఐఎస్ఎఫ్


