● జెరూసలేము సందడి.. చూద్దాం రండి
గుంతకల్లు: క్రిస్మస్ సందర్భంగా గుంతకల్లులోని మస్తాన్పేట్లో నివాసముంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి హృదయ్మోహన్ ఫెర్నాండెజ్, నిర్మలామేరి దంపతులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని విశదీకరించేలా బొమ్మలను కొలువుదీర్చారు. ఇందు కోసం తన ఇంటి మిద్దైపె ఓ ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేశారు. ఏసు పుట్టిన సమయంలో తోక చుక్క ఆవిర్భవించడం మొదలు... గొర్రెల కాపరుల చుట్టూ పెద్ద వెలుగు రావడం, అప్పటి నజరేతు, బేత్లహము, జెరూసలేము, ఈజిప్టు వాసుల వేషధారణ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ... దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఆఫ్రికా, బెంగుళూరు, ముంబయి, చైన్నె, హైదరాబాదు తదితర నగరాల నుంచి బొమ్మలను సేకరించి కొలువు దీర్చినట్లు తెలిపారు. నెల రోజుల పాటు సందర్శకుల కోసం బొమ్మల కొలువును ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
పశువులు మేత తొట్టెలో నిద్రిస్తున్న బాలయేసు, ఏసు పుట్టుకను తెలుసుకుని జెరూసలేము నుంచి బేత్లహము బయలుదేరిన రాజులు
● జెరూసలేము సందడి.. చూద్దాం రండి
● జెరూసలేము సందడి.. చూద్దాం రండి
● జెరూసలేము సందడి.. చూద్దాం రండి


