
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైంది. ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేస్తున్న పత్రికలపై, పత్రికా విలేకరులపై ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పత్రిక ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఉన్న వాక్ స్వాతంత్య్రాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. దీనిని ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.
– ఓతూరు పరమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

పత్రికా స్వేచ్ఛను కాపాడాలి