అనకాపల్లి: జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విల్లూరి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా అమ్ములోజు శ్రీను, కోశాధికారిగా ఆడారి నాయుడు ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక గవరపాలెం కామాక్షమ్మ దేవాలయం మేడపైన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కోరిబిల్లి సోమినాయుడు, ముఖ్య సలహాదారులుగా ఎం.ఎన్.ఎస్.అప్పారావు, బి.బాలాజీ బద్రీనాథ్, జిల్లా లీగల్ అడ్వైజర్గా వేలం చంద్రశేఖర్, కార్యదర్శిగా ఆళ్ల ప్రవీణ్కుమార్, వర్కింగ్ అధ్యక్షుడిగా ఏఎంఎస్ శివకుమార్, మీడియో ఇన్చార్జిగా యల్లపు వెంకట రమణాజీ, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా చింతా లక్ష్మణరావు, బుద్ధ జగన్, పిన్నపోతుల సంతోష్, ఉపాధ్యక్షులుగా భీశెట్టి తిరుమల, అందే కుమార్, బుద్ధ అప్పలనాయుడు, ఆళ్ల సతీష్ కుమార్, యల్లపు సత్యనారాయణ, వేపాడ సత్తిబాబు, సహాయ కార్యదర్శులుగా వేగి అజయ్కుమార్, కరణం కృష్ణ, గొర్లి స్వామి, లోవరాజు, శ్రావణ్కుమార్, శ్రీను, లక్ష్మణరావు సంతోష్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా అసోసియేషన్ వ్యవస్థాపకుడు కె.గురునాథరావు, రాష్ట్ర కార్యదర్శి టి.రాము, ఉపాధ్యక్షులు ఎం.ఎన్.ఎన్ అప్పారావు, వై.శ్రీనివాసరావు వ్యవహరించారు. నూతన కమిటీ రెండేళ్లు ఉంటుందని కె.గురునాథరావు చెప్పారు.


