మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు

Sep 29 2025 7:26 AM | Updated on Sep 29 2025 7:26 AM

మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు

మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు

సీతంపేట (విశాఖ): నగరానికి చెందిన దర్శకుడు పైడి శంకర్రావు సుదీప్‌ సాయి హీరోగా రూపొందించిన లఘు చిత్రం ‘మనసు’కు అరుదైన గౌరవం లభించింది. ఈ లఘు చిత్రాన్ని పుదు చ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌. రంగస్వామి వీక్షించి, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. సాహిత్య అకాడమి మాజీ సభ్యుడు డాక్టర్‌ సుందర్‌ మురుగన్‌ ఈ లఘు చిత్రం ఇతివృత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మనసు లఘు చిత్రం భారతీయుల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ, భావితరాలకు మెరుగైన మార్గనిర్దేశం చేసేలా ఉందని సీఎం రంగస్వామి కొనియాడారు. ఈ చిత్రం ప్రపంచ శాంతి అనే మూల సందేశాన్ని, భారతదేశ సంప్రదాయానికి నిలువెత్తు అద్దంగా ఉంటుందని, ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పైడి శంకర్రావు, హీరో సుదీప్‌ సాయిలను ముఖ్యమంత్రి సత్కరించారు. చిత్ర యూనిట్‌ తరపున నిర్మాత పైడి సత్యమణి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

హీరో సుదీప్‌ని సత్కరిస్తున్న పుదుచ్ఛేరి సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement