● దివ్య సౌందర్యాన్ని తిలకించిన భక్తులు, ప్రకృతి ప్రేమికులు
చింతపల్లి: గురుపౌర్ణమి పర్వదినాన మండల కేంద్రం చింతపల్లిలో ఒకేసారి మూడు బ్రహ్మకమలాలు వికసించి అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక రాజమ్మగరువులో నివాసముంటున్న ఉప్పల బంగారయ్యశెట్టి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో మూడు బ్రహ్మకమలాలు విరబూసి కనువిందు చేశాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు, ప్రకృతి ప్రేమికులు ఈ అరుదైన దివ్య పుష్పాలను తిలకించి పరవశించారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే, అదీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో వికసించే బ్రహ్మకమలం గురుపౌర్ణమి రోజున పూయడం ఎంతో శుభసూచకమని స్థానికులు అభిప్రాయపడ్డారు.


