విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
నక్కపల్లి: జాతీయరహదారిపై ఒడ్డిమెట్ట సమీపంలో సోమవా రం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలప్రకారం మండలంలో దేవవరం శివారు ఒడ్డిమెట్ట గ్రామానికి చెందిన పెట్ల గణపతి(52) దేవవరం నుంచి ఒడ్డిమెట్టకు నడిచి వెళ్తుండగా చినరామభద్రపురం, ఒడ్డిమెట్ట మధ్యలో నక్కపల్లినుంచి తునివైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గణపతి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు


