గిరిజనులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం

Oct 18 2025 7:21 AM | Updated on Oct 18 2025 7:21 AM

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం

మాతాశిశు ఆరోగ్యసేవలపై ప్రత్యేక దృష్టి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణమూర్తినాయక్‌

సాక్షి, పాడేరు: గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందంచడమే లక్ష్యంగా పనిచేయడంతో పాటు, మాతాశిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.కృష్ణమూర్తినాయక్‌ తెలిపారు. డీఎంహెచ్‌వోగా ని యమితులైన ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానన్నారు. డోలీమోతలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూ పొందిస్తామన్నారు. పీహెచ్‌సీల వైద్యులు,ఇతర సిబ్బంది, 108, బైక్‌ అంబులెన్స్‌ల సిబ్బంది స మన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటా నని తెలిపారు.అన్ని గ్రామాల్లో మాతాశిశు మరణాల నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసూతి తేదీకి వారం రోజుల ముందుగానే గర్భిణులను దగ్గరలో ఉన్న ప్రసూతి కేంద్రాలకు తరలించాలని వైద్యబృందాలను ఆదేశించారు.అన్ని పీహెచ్‌సీల్లో అత్యవసర మందులు,వ్యాక్సిన్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement