నాణ్యమైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన సేవలు అందించాలి

Oct 2 2025 8:18 AM | Updated on Oct 2 2025 8:18 AM

నాణ్యమైన సేవలు అందించాలి

నాణ్యమైన సేవలు అందించాలి

హుకుంపేట: ఆస్పత్రిలో నిత్యం అందుబాటులో ఉంటు గిరిజనులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా.విశ్వేశ్వరనాయుడు అన్నారు. బుధవారం స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రికార్డులను పరిశీలించారు. రోగులనుంచి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు సేవలందించాలని సూచించారు. ములియపుట్టులో జరిగిన స్వస్థ్‌ నారి సశక్త్‌ పరివార్‌ అభియన్‌ ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్యాధికారి శ్రావణ్‌కుమార్‌, ఆరోగ్య విస్తరణ అధికారి సింహాద్రిపాత్రుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement