బోథ్: ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నియోజకవర్గానికి ఇటీవల మూడు కొత్త సబ్స్టేషన్లు మంజూ రైనట్లు తెలిపారు. బోథ్ మండలంలోని ధ న్నూర్ (బి), నేరడిగొండ మండలంలోని కు ప్టి, తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు ధన్నూర్ (బి)లో బుధవారం ఆయన స్థల పరిశీలన చేశారు. సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6న బ జార్హత్నూర్ మండలంలోని పిప్రిలో భూ మిపూజ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


